Posted on 2025-04-26 17:42:42
మా డ్యూటీ షిఫ్ట్లు మేమే వేసుకుంటాం మమ్మల్ని అడిగేది ఎవరు? ఆపేదెవ్వరు?
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం క్షయ వ్యాధి నివారణ కేంద్రంలో పనిచేసే నర్సుల పనితీరు చాలా దారుణంగా తయారైందని క్షయ వ్యాధి రోగులు రోదన పెడుతున్నారు? భద్రాచలంలో గల క్షయ వ్యాధి నివారణ కేంద్రంలో పరిస్థితులు, పరిశుభ్రత అత్యంత దారుణంగా ఉన్నాయి, ఇక్కడ పనిచేసే నర్సులు వారి డ్యూటీలు వారే వేసుకుంటూ ఒక్కొక్క షిఫ్ట్ లో కేవలం గంట డ్యూటీ మాత్రమే చేసి, అంటే ఇంజక్షన్లు ఇచ్చి అక్కడ ఉండకుండా పేషంట్లకు ఏదైనా అవసరమైతే చూసుకోకుండా ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఇందులో ఒక్కళ్ళిద్దరు నర్సులు మాత్రం డ్యూటీకి వస్తున్నారో లేదో వస్తే ఇంజక్షన్ వేసి ఎటు వెళ్ళిపోతున్నారూ తెలియని పరిస్థితి, ఇలా చాలాకారంగా జరుగుతుంది, క్షయ వ్యాధి నివారణ కేంద్రంలో మరుగుదొడ్ల పరిస్థితి చూస్తే అసలు ఇక్కడ ఏమి జరుగుతుందనేది ఎంత దారుణంగా పరిస్థితి ఉన్నది తెలుస్తుంది, ప్రభుత్వం క్షయ వ్యాధి పేషెంట్లను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని వారికి మనోధైర్యాన్ని నింపాలని వారి వెనువంటే ఉంటూ వారి కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం కల్పిస్తూ వాళ్ళని కాపాడాలని ఎన్నో లక్షల ఖర్చుపెట్టి ఆసుపత్రులను డాక్టర్లను నర్సులను నియమిస్తే ఇక్కడ భద్రాచలంలో క్షయ వ్యాధి నివారణ కేంద్రంలో పనిచేసే నర్సులు పనితీరు అత్యంత దారుణంగా తయారయింది, దీనిపై పక్కనే ఉన్న ఐటీడీఏ లో ఉన్న డిప్యూటీ అధికారుల పర్యవేక్షణ కూడా లేదు దీనికి ఇన్చార్జిగా ఏ అధికారి, వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలియని పరిస్థితి? ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వీళ్ళ పని తీరుపై విచారణ జరిపి క్షయ వ్యాధి నివారణ కేంద్రంలో ఎప్పుడు నర్సులు డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు...
మహిళల భద్రతే లక్ష్యం – ప్రజల్లో చైతన్యం నింపుతున్న కామారెడ్డి షీ టీమ్
Posted On 2026-06-07 13:06:00
Readmore >
ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా “ఫిట్ ఇండియా మూవ్మెంట్” సైక్లింగ్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-07 13:04:42
Readmore >
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >