| Daily భారత్
Logo




ఏసీబీ కంటే ముందు ఈడీనే కేటీఆర్‌కు నోటీసులు

News

Posted on 2024-12-28 12:07:55

Share: Share


ఏసీబీ కంటే ముందు ఈడీనే కేటీఆర్‌కు నోటీసులు

డైలీ భారత్, తెలంగాణ డెస్క్:ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. దర్యాప్తు ప్రారంభించింది. కేటీఆర్ కు ఇంకా నోటీసులు జారీ చేయలేదు. కానీ ఏసీబీ కేసు ఆధారంగా కేసు పెట్టిన ఈడీ మాత్రం ఆగడంలేదు. వెంటనే నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేసు విషయంలో డబ్బులు విదేశాలకు తరలించిన వ్యవహారంలో జనవరి 7 న ఈడీ విచారణ కు హాజరు కావాలని కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది.

ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలకు కూడా ఈనోటీసులు అందాయి. వీరిని ముందే రావాలని ఆదేశించింది. జనవరి 2, 3 తేదీల్లో వీరు విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద విచారణ చేస్తున్న ఈడీ.. పెమా నిబంధనలు ఉల్లగింన జరిగినట్లు ఇప్పటికే గుర్తించినట్లుగా తెలుస్తోంది. FEO కు 55 కోట్లు నగదు బదిలీ , ఆర్థిక పరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ కేసు పెట్టింది.

తెలంగాణ ఏసీబీ పెట్టింది అవినీతి కేసు. అక్కడ అవినీతి లేదని కేటీఆర్ వాదిస్తున్నారు. ఈడీ పెట్టింది డబ్బుల అక్రమ తరలింపు కేసు . కేటీఆర్ ఇలా తరలిపోయిందని అంగీకరిస్తున్నారు. అయితే తనకు సంబంధం లేదంటున్నారు. ఈ విషయాన్ని ఈడీ తేలుస్తుంది. మొత్తంగా ఏసీబీ కన్నా ఈడీనే దూకుడుగా ఉండటం బీఆర్ఎస్ క్యాంప్‌నకు ఆందోళన కలిగించేదే.

Image 1

రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

Posted On 2026-06-06 22:16:35

Readmore >
Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >