Posted on 2024-12-28 06:37:55
డైలీ భారత్, తెలంగాణ డెస్క్:ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. దర్యాప్తు ప్రారంభించింది. కేటీఆర్ కు ఇంకా నోటీసులు జారీ చేయలేదు. కానీ ఏసీబీ కేసు ఆధారంగా కేసు పెట్టిన ఈడీ మాత్రం ఆగడంలేదు. వెంటనే నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేసు విషయంలో డబ్బులు విదేశాలకు తరలించిన వ్యవహారంలో జనవరి 7 న ఈడీ విచారణ కు హాజరు కావాలని కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది.
ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈనోటీసులు అందాయి. వీరిని ముందే రావాలని ఆదేశించింది. జనవరి 2, 3 తేదీల్లో వీరు విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద విచారణ చేస్తున్న ఈడీ.. పెమా నిబంధనలు ఉల్లగింన జరిగినట్లు ఇప్పటికే గుర్తించినట్లుగా తెలుస్తోంది. FEO కు 55 కోట్లు నగదు బదిలీ , ఆర్థిక పరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ కేసు పెట్టింది.
తెలంగాణ ఏసీబీ పెట్టింది అవినీతి కేసు. అక్కడ అవినీతి లేదని కేటీఆర్ వాదిస్తున్నారు. ఈడీ పెట్టింది డబ్బుల అక్రమ తరలింపు కేసు . కేటీఆర్ ఇలా తరలిపోయిందని అంగీకరిస్తున్నారు. అయితే తనకు సంబంధం లేదంటున్నారు. ఈ విషయాన్ని ఈడీ తేలుస్తుంది. మొత్తంగా ఏసీబీ కన్నా ఈడీనే దూకుడుగా ఉండటం బీఆర్ఎస్ క్యాంప్నకు ఆందోళన కలిగించేదే.
ఆడ పిల్లలను జన్మనిస్తుందనే సాకుతో భార్య ఇద్దరు పిల్లలను హత్య.... వరంగల్ పోలీస్ కమిషనర్
Posted On 2026-04-10 09:22:18
Readmore >
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలి: జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్
Posted On 2026-04-10 08:29:28
Readmore >
AO మరియు PACS CEO కి రైతుల తరఫున వినతి పత్రం అందజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంగారెడ్డి సర్పంచ్ చంద్ర రెడ్డి
Posted On 2026-04-10 08:06:50
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్
Posted On 2026-04-10 07:32:15
Readmore >
విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-10 07:25:14
Readmore >
ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ
Posted On 2026-04-10 06:36:42
Readmore >