| Daily భారత్
Logo




సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

News

Posted on 2024-09-07 14:52:06

Share: Share


సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వంతో పార్టీని సమన్వయం చేయడంతో పాటు రాబోయే లోకల్‌ బాడీ ఎన్నికలే నా ముందున్న అతిపెద్ద సవాల్‌ అని నూతన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. తన నియామకానికి సహకరించిన అధిష్టానానికి, రాష్ట్ర   పార్టీ  నేతలందరికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో కష్టపడిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని ఇందుకు తన నియామకమే నిదర్శనమన్నారు. పీసీసీ పదవి కోసం చాలా మంది పోటీ పడ్డారని వారందరూ ఆ పదవికి అర్హులే అయినప్పటికీ వివిధ సమీకరణాల నేపథ్యంలో అధిష్టానం తనకు అవకాశం కల్పించిందని భావిస్తున్నానన్నారు.

ఈ ఉదయం తన  కుటుంబసభ్యులతో  కలిసి  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మహేశ్‌కుమార్‌ గౌడ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన నియామకానికి సహకరించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన గణపతి పూజలో మహేశ్‌ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అనంతరం ఓ న్యూస్‌ చానల్‌తో మాట్లాడిన మహేశ్‌కుమార్‌ గౌడ్‌.. పీసీసీ పదవి విషయంలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన అధివ్ణానానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ పదవి కోసం పోటీ పడిన వారితో కలిసి పని చేస్తానన్నారు. ఈ పదేళ్ల పాటు పార్టీనే నమ్ముకుని కష్టపడిన కార్యకర్తలకు పార్టీలో, ప్రభుత్వంలో సముచిత స్థానం దక్కేలా కృషి చేస్తానన్నారు. 

రెండు మూడు రోజుల్లో టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తానన్నారు. ప్రభుత్వానికి, పార్టీకి వారధిగా ఉంటూ రాష్ట్రంలో పాట్ట బలోపేతానికి కృషి చేస్తానన్నారు. త్వరలోనే  కమిటీలను నియమిస్తామని, పార్టి పదవులు భర్తీ చేస్తామని చెప్పారు. కాగా, వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి సైతం సీఎంను మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం వీరిద్దరు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు.

Image 1

రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలి : ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు

Posted On 2026-04-13 11:03:05

Readmore >
Image 1

యాక్సిస్ బ్యాంక్‌లో భారీ మోసం

Posted On 2026-04-13 08:36:04

Readmore >
Image 1

మేము కొన్ని తప్పులు చేశాము

Posted On 2026-04-12 22:37:33

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు

Posted On 2026-04-12 18:45:08

Readmore >
Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >