Posted on 2023-11-08 18:26:28
మోసపూరిత బీఆరెస్ ప్రభుత్వాన్ని ఓడిద్దాం కాంగ్రెస్ నేత కెకె మహేందర్ రెడ్డి
డైలీ భారత్, సిరిసిల్ల: మోసపూరిత బి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి అన్నారు సిరిసిల్లలోని
తంగాళ్ళపల్లి మండల అధ్యక్షులు ప్రవీణ్ టోనీ అద్వర్యం లో పలువురు వివిధ పార్టీల నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు అనంతరం కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ
దశాబ్ద కాలంగా అనేక హామీలు ఇచ్చి నిరుపేదల సంక్షేమాన్ని మరచి ఏ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా మోసపూరితంగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికలలో పారదోలాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నన్ను గెలిపించాలని ఆయన కోరారు కాంగ్రెస్ పార్టీలో మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షురాలు లింగం రాణి తంగాళ్ళపల్లి రెడ్డి సంఘం మాజీ అధ్యక్షులు గంగ రాజీ రెడ్డి, నేరెళ్ల బిఎస్పి అధ్యక్షులు ఆనంద్ ఆధ్వర్యంలో పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేకే మహేందర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్,భూపతి,సుద్దాల శ్రీనివాస్,లక్ష్మీరాజం,శ్రీకాంత్. మునిగ రాజు. భారత్.పరశురాములు.హారిక,సరిత,భాగ్య, శంకర్,లక్ష్మణ్,,
యూత్ కాంగ్రెస్ సభ్యులు పాల్గొన్నారు
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >