Posted on 2023-11-02 21:03:28
డైలీ భారత్, నిర్మల్ జిల్లా: తెలంగాణ లో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం కేసీఆర్ ఆయా నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ సభల్లో పాల్గొంటు వరాల జల్లు కురిపిస్తున్నారు.
దీంట్లో భాగంగా గురువారం నిర్మల్ జిల్లాలో ప్రజా ఆశ్వీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డిని గెలిపిస్తే ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ వచ్చాక ఎన్నో జిల్లాలుగా ఏర్పాటు చేసుకుని అభివద్ధిని సులభతరం చేసుకుంటున్నామని..ఇంద్రకరణ్ రెడ్డి చొరవతో అయన కోరిక మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లా ఏర్పాటైందని తెలిపారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్మల్ జిల్లా అభివద్ధిలో దూసుకుపోతోందని అటువంటి నిర్మల్ జిల్లాకు మెడికల్ కాలేజీలు మంజూరు చేసుకున్నామని తెలిపారు. నిర్మల్ జిల్లా ఏర్పడం వల్లే అభివృద్ధి జరుగుతోందని ఈ ఘనత అంతా ఇంద్రకరణ్ రెడ్డిదేనని..మరోసారి ఆయన్ని గెలిపిస్తే ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
కేసీఆర్ చెప్పాడంటే శిలాశాసనమే, ఆరు నూరైనా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే : సీఎం కేసీఆర్
ఎన్నికల వేళ ఎన్నో పార్టీలు వస్తాయి. ఓట్లు అడగుతాయి. కానీ ఏ పార్టీ ఎటువంటిదో.. ఏ అభ్యర్థి ఎలాంటివాడో తెలుసుకుని ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.
ఓటు అనేది ప్రతీ వ్యక్తి చేతిలో ఉండే వజ్రాయుధం అని ఆ ఆయుధాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చేసే పార్టీకి ఓటు వేయాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టి అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాల వల్లనే ఈరోజు ఎన్నడూ ఊహించని విధంగా నిర్మల్ జిల్లాకు మెడికల్ కాలేజీ వచ్చిందన్నారు.
రాష్ట్రాన్ని శాంతి యుతంగా ముందుకు తీసుకెళుతున్నామని గిరిజన జిల్లాగా పేరొంది..అభివద్ధికి నోచుకోని జిల్లాను రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఎంతో గొప్పగా అభివృద్ధి చేసుకున్నామని..నిర్మల్ ఈరోజున ఇలా ఉందంటే ఇంద్రకరణ్ రెడ్డి వల్లేనన్నారు. మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ జిల్లా మరింతగా అభివృద్ధి చెందాలంటే మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ఇలా మరింతగా మీ ఆశలకు..ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తామని హామీ ఇఛ్చారు.
ప్రలోభాలకు లొంగిపోకుండా కత్తులతో దాడులకు పాల్పడే కాంగ్రెస్ కు బుద్ధి చెప్పి కల్లబొల్లి మాటలు చెప్పే బీజేపీకి బుద్ధి చెప్పి బీఆర్ఎస్ కు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కెసిఆర్ కోరారు...
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Posted On 2026-06-05 20:14:05
Readmore >