| Daily భారత్
Logo




మూడోసారీ ఆడపిల్లేనని అబార్షన్ ఆ తరవాత మహిళ మృతి

News

Posted on 2026-07-28 17:22:38

Share: Share


మూడోసారీ ఆడపిల్లేనని అబార్షన్ ఆ తరవాత మహిళ మృతి

జనగామ జిల్లాలో ఘటన ఇద్దరు అరెస్ట్

డైలీ భారత్ డెస్క్: మూడో సారీ ఆడపిల్లే అని తేలడంతో అబార్షన్ చేసుకున్న మహిళ తీవ్ర రక్తస్రావంతో చనిపోయింది. మహిళ మృతికి కారణమైన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... జనగామ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన భాస్కర్ గౌడ్ కు దేవరుప్పుల మండలం కొలుకొండ గ్రామానికి చెందిన శ్రావణి (35)తో వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. భాస్కర్ గౌడ్ హైదరాబాద్ లో ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు.శ్రావణి మూడోసారి గర్భం దాల్చడంతో కొన్ని రోజులుగా తల్లిగారింట్లో ఉంటోంది. ఇటీవల శ్రావణి, ఆమె తల్లి శోభ హనుమకొండలోని ఓ ప్రైవేట్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ నిర్వాహకుడు ప్రవీణ్ దగ్గరకు వెళ్లగా.. అతడు శ్రావణిని పరీక్షించి కడుపులో ఉన్నది ఆడపిల్ల అని చెప్పాడు. ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉండగా.. మళ్లీ అమ్మాయి అని తేలడంతో అబార్షన్ చేయించాలని నిర్ణయించారు. దీంతో కోలుకొండకు చెందిన ఆర్ఎంపీ రచ్చ శ్రావణ్ కుమార్ సహకారంతో జనగామలోని సంజయ్ నగర్ కు చెందిన ప్రైవేట్ ఏఎన్ఎం అనసూయను కలిశారు.ఆమె ఈ నెల 21న తన ఇంట్లోనే శ్రావణికి అబార్షన్ చేసింది. తర్వాతి తోరు శ్రావణికి తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే సికింద్రాబాద్ లోని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ శనివారం తెల్లవారుజామున శ్రావణి చనిపోయింది. భర్త భాస్కర్ గౌడ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఏఎన్ఎం అనసూయ, ఆర్ఎంపీ రచ్చ శ్రావణ్ కుమార్ ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అబార్షన్ కు ప్రోత్సహించిన మృతురాలి తల్లి శోభ, స్కానింగ్ చేసిన డయగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకుడు పరారీలో ఉన్నారని జనగామ సీఐ సత్యానారాయణ రెడ్డి తెలిపారు.

Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >
Image 1

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్

Posted On 2026-08-02 09:35:33

Readmore >
Image 1

స్వర్ణ కాంతుల్లో భారత వనితలు... రింగులో రికార్డుల పంట!

Posted On 2026-08-02 07:32:52

Readmore >
Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >
Image 1

G.O 25 రద్దు చేయాలి, CPS రద్దు చేసి OPS అమలు చేయాలి: TPTF

Posted On 2026-08-01 16:59:26

Readmore >
Image 1

జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్

Posted On 2026-08-01 16:47:06

Readmore >
Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >