Posted on 2026-07-23 16:06:22
డైలీ భారత్, కొణిజర్ల : ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి పంచాయతీ ఎల్లన్నగర్ గ్రామంలో గత 20 సంవత్సరాలుగా సీసీ రోడ్లు లేక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో బురద, వేసవిలో దుమ్ముతో నిత్యం అవస్థలు పడుతున్న ప్రజల సమస్యను గ్రామ సర్పంచ్ దంతాల ప్రశాంతి - నరసింహారావు గుర్తించి వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు.
గ్రామ ప్రజల సమస్యను వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ ఎల్లన్నగర్ గ్రామానికి రూ.15 లక్షల విలువైన సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంజూరు చేశారు.
మంజూరైన నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దంతాల ప్రశాంతి - నరసింహారావు, ఉప సర్పంచ్ యుగంధర్, వార్డు సభ్యులు మహమ్మద్ సైదల్లి, లాల్ సింగ్, గ్రామ పెద్దలు సోములు మరియు గ్రామస్తులు పాల్గొని పనులను పరిశీలించారు.
గ్రామానికి సీసీ రోడ్డు మంజూరు చేసి ప్రజల సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్కు గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >