| Daily భారత్
Logo




మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కామారెడ్డి జిల్లా పోలీసుల చర్యలు

News

Posted on 2026-07-23 15:56:26

Share: Share


మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కామారెడ్డి జిల్లా పోలీసుల చర్యలు

38 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ నిందితులు కోర్టు ముందు హాజరు

రూ.43,500 జరిమానా విధింపు – 5 మందికి ఒక రోజు జైలు శిక్ష

డైలీ భారత్, కామారెడ్డి : రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణాల రక్షణే లక్ష్యంగా కామారెడ్డి జిల్లా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 38 మందిని గుర్తించి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి మొత్తం రూ.43,500 జరిమానా విధించింది. అదేవిధంగా 5 మందికి ఒక రోజు జైలు శిక్ష విధించింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, IPS మాట్లాడుతూ, "మద్యం సేవించి వాహనం నడపడం ఒక చట్ట ఉల్లంఘన మాత్రమే కాదు... ఒక కుటుంబం జీవితాన్ని శాశ్వతంగా విషాదంలోకి నెట్టివేసే ప్రమాదకరమైన చర్య. మీ కోసం ఇంట్లో ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులను ఒక్కసారి గుర్తు చేసుకోండి. క్షణిక ఆనందం కోసం తీసుకునే నిర్లక్ష్య నిర్ణయం జీవితాంతం పశ్చాత్తాపానికి కారణం కావొద్దు. మీ ప్రాణాలతో పాటు రోడ్డుపై ప్రయాణించే అమాయకుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టొద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ను కామారెడ్డి జిల్లా పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచి జరిమానాలు, జైలు శిక్షలు సహా చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాం. మీ కుటుంబం కోసం... మీ ప్రాణం కోసం... సమాజ భద్రత కోసం మద్యం సేవించి వాహనాలు నడపవద్దు" అని తెలిపారు

జిల్లా పోలీసుల విజ్ఞప్తి:

మద్యం సేవించి వాహనాలు నడపవద్దు.

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించండి.

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు ప్రయాణికులు సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించండి.

మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడండి.

కామారెడ్డి జిల్లా పోలీసులు ప్రజల భద్రతే లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలను నిరంతరం కొనసాగిస్తూ, నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >
Image 1

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్

Posted On 2026-08-02 09:35:33

Readmore >
Image 1

స్వర్ణ కాంతుల్లో భారత వనితలు... రింగులో రికార్డుల పంట!

Posted On 2026-08-02 07:32:52

Readmore >
Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >
Image 1

G.O 25 రద్దు చేయాలి, CPS రద్దు చేసి OPS అమలు చేయాలి: TPTF

Posted On 2026-08-01 16:59:26

Readmore >
Image 1

జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్

Posted On 2026-08-01 16:47:06

Readmore >
Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >