Posted on 2026-07-23 13:29:02
డైలీ భారత్, యాదాద్రి భువనగిరి:యాదగిరిగుట్టను ప్లాస్టిక్ రహిత పుణ్యక్షేత్రంగా మార్చాలని మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, మాజీ బ్రాహ్మణ సేవా వాహిని (BSV) యాద్రి భువనగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు మంజుల పత్తిపాటి కోరారు.
ఆమె విలేకరులతో మాట్లాడుతూ యాదాద్రి దేవాలయ పరిరక్షణ ప్రతి భక్తుడి బాధ్యత అని అన్నారు. "మనం స్వామిని దర్శించుకోవడంతో పాటు కొండను కూడా పరిశుభ్రంగా ఉంచాలి. ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లను యాద్రి కొండపైకి తీసుకురాకూడదు. బదులుగా పునర్వినియోగ సంచులను వాడి, శుభ్రమైన యాదాద్రిని భావితరాలకు అందిద్దాం" అని పిలుపునిచ్చారు.
"దేవాలయ పరిరక్షణే పరమ పూజ" అని ఆమె అన్నారు. తిరుమల కొండపై అమలు చేస్తున్న విధంగా యాదాద్రి కొండపై కూడా ప్లాస్టిక్ నిషేధాన్ని వెంటనే విధించాలని దేవస్థాన కమిటీని కోరారు.
భక్తులు ఈ నిబంధనలను స్వచ్ఛందంగా పాటించి, యాద్రిని మరింత పవిత్రంగా, పరిశుభ్రంగా ఉంచాలని మంజుల పత్తిపాటి విజ్ఞప్తి చేశారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >