Posted on 2026-07-18 15:41:39
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపాలిటీలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ దాడులు నిర్వహించింది. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శ్రీ ముకుంద్ రెడ్డి ఆదేశాలతో ఎక్సైజ్ సిబ్బంది నగరంలోని హోటళ్లు, మెస్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఇందులో భాగంగా డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ ఎదురుగా ఉన్న లక్ష్మీ మెస్లో అనుమతి లేకుండా మద్యం తాగేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు గుర్తించారు. దీంతో మెస్ నిర్వాహకుడు లింబయోల దిలీప్ రెడ్డిపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ మాట్లాడుతూ, హోటళ్లు, మెస్లు, దాబాల్లో అనుమతి లేకుండా మద్యం అమ్మడం లేదా తాగనివ్వడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి అక్రమాలు జరుగుతుంటే వెంటనే ఎక్సైజ్ శాఖకు సమాచారం అందించాలని కోరారు.
ఈ దాడిలో ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ, ఎస్సై విక్రంకుమార్, హెడ్ కానిస్టేబుల్ ఫరీద్, కానిస్టేబుళ్లు రాజు, దినేష్ పాల్గొన్నారు.
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >
తాడ్వాయి మండలంలోని కరడ్పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
Posted On 2026-08-06 18:26:12
Readmore >
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >