Posted on 2026-06-11 18:24:17
టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు డాక్టర్ బాలు
డైలీ భారత్, కామారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల క్రితం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిజిపిఎస్సి ద్వారా విడుదల చేసిన డిప్యూటీ ఈవో పోస్టుల భర్తీలో విద్యార్హతను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి కల్పించడం సరియైన నిర్ణయం కాదని,ఈ పోస్టు పాఠశాల విద్యకు సంబంధించినది కావున బిఈడీ, ఏంఈడీ చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ప్రభుత్వానికి సూచించారు. ఈ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది అభ్యర్థులు ఉన్నత విద్యను పూర్తి చేసుకున్నప్పటికీ వారికి అవకాశం కల్పించకుండా కనీస అర్హతగా పీజీని నిర్ణయించడం సరికాదని అన్నారు.20 సంవత్సరాల క్రితం ఉన్న నియామక విధి విధానాలనే ప్రస్తుతం యధాతధంగా అమలుపరిచే ప్రయత్నం చేయడం భవిష్యత్ విద్యావ్యవస్థను ఇబ్బందులకు గురి చేస్తుందని అభిప్రాయపడడం జరిగింది. వెంటనే ప్రభుత్వం నోటిఫికేషన్ లో మార్పులు చేపట్టాలని సూచించారు.
కేదార్నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >