Posted on 2026-06-14 18:20:08
డైలీ భారత్, మహబూబాబాద్: తొర్రూరు మండల కేంద్రంలో ఆదివారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అన్నారం రోడ్డులోని భద్రకాళి ఆలయం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో గుర్తూరు గ్రామానికి చెందిన జడల నవీన్ (32) అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, నవీన్ నెల్లికుదురు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో కాంట్రాక్ట్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో కుటుంబ సభ్యులతో గడిపేందుకు తొర్రూరుకు వచ్చిన ఆయన చేపలు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నవీన్ తీవ్ర గాయాలతో సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న నవీన్ ఆకస్మిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాపాయం తప్పి ఉండేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన పెట్రోల్ ట్యాంకర్ను పోలీస్ స్టేషన్కు తరలించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తోట మహేందర్ రెడ్డి తెలిపారు. అక్కడికి వచ్చిన యువతకు బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ కచ్చితంగా ధరించి ఉంటే మృతుడు బ్రతికి ఉండేవాడు కదా అని అక్కడ ఉన్న స్థానికులను హెచ్చరించారు.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >