Posted on 2026-06-15 06:56:34
డైలీ భారత్, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాల కోసం కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం భోగంపాడు గ్రామానికి చెందిన కల్లం రాధిక, రాజారెడ్డి దంపతులు రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు.
దాతలు సమర్పించిన విరాళాన్ని ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ స్వీకరించారు. అనంతరం దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు స్వామివారి ఆశీర్వచనాలు అందజేసి, శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని సమర్పించారు.
ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు భక్తులు అందించే విరాళాలు ఎంతో దోహదపడుతున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధికి భక్తులు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.
#Vemulawada #RajarajeshwaraSwamy #TempleDonation #RajannaTemple
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >