Posted on 2026-06-11 18:20:26
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సరోజనాపురంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఎన్సీపీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు (ఎన్వైసీ), ఆంధ్రప్రదేశ్ & ఒడిశా రాష్ట్రాల ఇన్చార్జి డా. మద్దిశెట్టి సామేలు పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్సీపీ పార్టీ – ఎన్డీఏ మహాకూటమిని అవమానపరిచే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేసినా, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలకు పాల్పడినా సహించేది లేదని హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే వారిపై పార్టీ క్రమశిక్షణా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 15 మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్పై ప్రత్యేక తనిఖీలు – 374 మందికి కోర్టు శిక్షలు
Posted On 2026-06-20 20:28:48
Readmore >
జడ్పీహెచ్ఎస్ దమ్మన్నపేటలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
Posted On 2026-06-20 19:32:50
Readmore >
ఎన్ఐటీ వరంగల్ మెంటరింగ్ కార్యక్రమానికి దమ్మన్నపేట విద్యార్థి ఎంపిక
Posted On 2026-06-20 19:30:39
Readmore >
40వ ఒలింపిక్ డే 2కే రన్-2026 కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ
Posted On 2026-06-20 19:13:51
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ అమలులో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాకు 8వ స్థానం
Posted On 2026-06-20 19:13:02
Readmore >