Posted on 2026-06-11 18:19:12
టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టర్, డీఈఓ లకు వినతి
డైలీ భారత్, కామారెడ్డి: జిల్లాలోని అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో 100% ఫీజు రాయితీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ మాట్లాడుతూ... జిల్లాలో 500 పైగా అర్హులైన జర్నలిస్టులు ఉన్నారు. వీరిలో పేద, మధ్యతరగతి కి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. అందుకని వారి పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో 100% ఫీజు రాయితీ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ జీవో ప్రకారం 100% రాయితీని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ కార్యాలయ సూపరిండెంట్ వరప్రసాద్, జిల్లా విద్యా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ లకు వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రాజేష్ , ఆబిద్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్, జర్నలిస్టులు శివ, శ్రీకాంత్, శ్రీనివాస్ రెడ్డి, ముదాం శంకర్, వెంకటేశ్వర్లు, మాణిక్య శ్రీకాంత్, మధు, ప్రభు తదితరులు పాల్గొన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్పై ప్రత్యేక తనిఖీలు – 374 మందికి కోర్టు శిక్షలు
Posted On 2026-06-20 20:28:48
Readmore >
జడ్పీహెచ్ఎస్ దమ్మన్నపేటలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
Posted On 2026-06-20 19:32:50
Readmore >
ఎన్ఐటీ వరంగల్ మెంటరింగ్ కార్యక్రమానికి దమ్మన్నపేట విద్యార్థి ఎంపిక
Posted On 2026-06-20 19:30:39
Readmore >
40వ ఒలింపిక్ డే 2కే రన్-2026 కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ
Posted On 2026-06-20 19:13:51
Readmore >