Posted on 2026-06-05 18:30:49
జూట్ బ్యాగులు, పర్యావరణహిత వస్తువులను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
డైలీ భారత్, కామారెడ్డి : ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని "ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం" కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జూట్ బ్యాగులను పంపిణీ చేసి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణహిత వస్తువుల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ప్లాస్టిక్ కాలుష్యం వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రజా సంబంధాల అధికారిణి తిరుమల , జిల్లా పంచాయతీ , జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శాఖల సిబ్బందికి పర్యావరణహిత జూట్ బ్యాగులను టిఫిన్ బాక్స్లు, వాటర్ బాటిళ్లను అందజేశారు.
రోజువారీ జీవితంలో ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా పునర్వినియోగ వస్తువులను ఉపయోగించాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.వి. గిరి ఆధ్వర్యం లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Posted On 2026-06-05 20:14:05
Readmore >