Posted on 2026-04-18 09:08:38
పోలీసు అధికారులను ఆహ్వానించిన కమిటీ
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలో ఏప్రిల్ 26, 2026న నిర్వహించనున్న “హిందూ సమ్మేళనం” కార్యక్రమానికి సంబంధించి, సమ్మేళనం కమిటీ సభ్యులు మరింత కార్యాచరణను వేగవంతం చేస్తున్నారు.
ఈ సందర్భంగా హిందూ సమ్మేళనం కమిటీ సభ్యులు కొత్తగూడెం సబ్ డివిజన్ డిఎస్పి ఆదినారాయణ మర్యాదపూర్వకంగా కలిసి, సమ్మేళనం కార్యక్రమానికి ఆహ్వానం అందజేశారు. కార్యక్రమం యొక్క లక్ష్యాలు, ఏర్పాట్లు మరియు ప్రజల పాల్గొనిక గురించి వివరించారు.
కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, హిందూ సమాజంలో ఐక్యత, ధర్మ పరిరక్షణ, సాంప్రదాయ విలువల పరిరక్షణ లక్ష్యంగా ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం శాంతియుతంగా మరియు క్రమబద్ధంగా నిర్వహించబడుతుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా డి.ఎస్.పి కార్యక్రమం గురించి తెలుసుకుని, చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించినట్లు తెలిసింది.
ఈ సమావేశంలో కమిటీ అధ్యక్షులు పి. వీరవర్ధనరావు, కార్యదర్శి లట్టి జగన్ మోహన్, సభ్యులు యెల్దండి పూర్ణచందర్ రావు, వెంకట్ రెడ్డి, రాజేశ్వరరావు, మరియు న్యాయవాది పాతూరి పాండురంగ విటల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >