Posted on 2026-04-07 11:09:21
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఔట్పేషెంట్ విభాగంలో రోగులతో మాట్లాడి సేవలు, సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. మహిళల వార్డు సహా పేషెంట్ వార్డులను పరిశీలించి రోగుల సంరక్షణపై ఆరా తీశారు.
ల్యాబ్ను తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ, రిజిస్టర్ను పరిశీలించారు. మందుల గది, స్టాక్ రిజిస్టర్ను తనిఖీ చేసి అవసరమైన ఔషధాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ఆరోగ్యశ్రీ సేవల అమలుపై వివరాలు సేకరించి అర్హులైన ప్రతి రోగికి సమయానికి సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రేడియాలజీ, స్కానింగ్, ఎక్స్-రే విభాగాల్లో ఆలస్యాలపై ఆరా తీసి, టెక్నీషియన్ల కొరత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పేషెంట్ వార్డుల్లో రోగులకు అందించే ఆహారాన్ని పరిశీలించి, నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పోషకాహారంలో అరటిపండ్లు, గుడ్లు అందించకపోవడాన్ని ప్రశ్నించి, ప్రభుత్వం నిధులకు అనుగుణంగా నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు.
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >
అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!
Posted On 2026-04-08 17:33:40
Readmore >