Posted on 2026-04-09 12:28:28
డైలీ భారత్, కామారెడ్డి:పట్టణానికి చెందిన ప్రముఖ శిశు వైద్య నిపుణుడు, జనని హాస్పిటల్లో సీనియర్ పీడియాట్రిషన్గా సేవలందిస్తున్న డాక్టర్ ఈ. అరవింద్ కుమార్ గౌడ్ ని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) లోని కంటిన్యూయింగ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ (CPD) కమిటీకి కో-ఆప్టెడ్ సభ్యునిగా నియమించారు.
నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్రంలో వైద్యులు తమ జ్ఞానాన్ని నిరంతరం నవీకరించుకోవడం తప్పనిసరి. ఈ క్రమంలో ప్రతి వైద్యుడు ప్రతి సంవత్సరం 5 క్రెడిట్ పాయింట్లు (సుమారు 40 గంటలు) కలిగిన CPD కార్యక్రమాలలో పాల్గొనాల్సి ఉంటుంది.
CPD కమిటీ ద్వారా ప్రొఫెషనల్ సంస్థలు, బోధనా సంస్థలకు అక్రెడిటేషన్ ఇవ్వబడుతుంది. ఈ కార్యక్రమాల ద్వారా వైద్యులు తాజా వైద్య పరిజ్ఞానం, ఆవిష్కరణలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మెడికో-లీగల్ అంశాలపై అవగాహన పెంపొందించడంపై కూడా కమిటీ దృష్టి సారిస్తోంది.
డాక్టర్ అరవింద్ కుమార్ గౌడ్ నియామకంపై వైద్య వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >
అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!
Posted On 2026-04-08 17:33:40
Readmore >