Posted on 2026-04-05 13:29:40
ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందిన సీఎండీ.
డైలీ భారత్, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పుణ్యక్షేత్రంలో ఉన్న రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని టీజీఎన్పీడీసియల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్ రెడ్డి ఆదివారం భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీఎండీకి అర్చకులు సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మండపంలో వేద పండితులు వేదోచ్చారణల మధ్య ఆశీర్వచనాలు అందజేయగా, సీఎండీ వినయంతో స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ సహాయక కార్యనిర్వహణ అధికారి (ఏఈఓ) జి. శ్రవణ్ కుమార్ స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, వేద పండితులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
ఈ పుణ్యక్షేత్ర దర్శనం ద్వారా ప ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోసం వేడుకున్నట్లు సీఎండీ తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >