Posted on 2026-04-05 07:53:47
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణం 36 వ వార్డు ప్రగతినగర్ కు చెందిన బొల్లి స్వప్న కి 12,500/-, షేఖ్ రూఫ్ కి 18,000/-, పోనిశెట్టి సంజన కి 9,000/-, దూస ప్రవలిక కి 17,000/-, నూకలమర్రి దేవేంద్రమ్మ కి 7,500/-, చిచ్చుల నర్సమ్మ కి 30,000/- రూపాయలు గల CMRF చెక్కులను ఈ రోజు స్థానిక కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు లబ్దిదారులకు అందించడం జరిగింది.
ఈ సందర్భంగా కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రులలో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం లాంటిదని, పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చెక్కు అందుకున్న లబ్దిదారులు మాజీ మంత్రి వర్యులు, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు కి, చెక్కు మంజూరికి కృషి చేసిన కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు కి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్, కొక్కుల నర్సయ్య,కోడూరి మల్లేశం,దూస ఎల్లప్ప,లింగంపెల్లి దేవయ్య, బొల్లి అంబదాస్ మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >