Posted on 2026-04-04 12:37:42
డైలీ భారత్, కామారెడ్డి: వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు జిల్లా పరిపాలన కీలక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం సివిల్ సప్లయ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కంట్రోల్ రూమ్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ 08468-220051 అనే కంట్రోల్ రూమ్ నంబర్ను ప్రజలకు అందుబాటులో ఉంచుతూ, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రైతులు తమకు ఎదురయ్యే సమస్యలు, సందేహాలు, కొనుగోలు సంబంధిత వివరాల కోసం ఈ నంబర్ను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.
వరి కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, వేగం, సమర్థతను పెంచేందుకు ఈ కంట్రోల్ రూమ్ ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
సివిల్ సప్ప్లయ్ అధికారి వెంకటేశ్వర్లు, DM శ్రీకాంత్, dco రామ్మోహన్, కార్యాలయ సిబ్బంది, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >