Posted on 2026-04-01 18:51:20
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి ఏఎస్పీ కార్యాలయంలోని పాత ఛాంబర్ను ప్రజల సౌకర్యార్థం మరియు కార్యాలయ అవసరాలకు అనుగుణంగా అన్ని హంగులతో పునరుద్ధరించడం జరిగింది. ఆధునీకరించిన ఈ నూతన ఛాంబర్ను ఈరోజు జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర ఐపీఎస్ అధికారికంగా ప్రారంభించారు. కార్యాలయానికి వచ్చే ప్రజలు/భాదితులు తమ సమస్యలను అధికారులకు విన్నవించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ప్రశాంతమైన మరియు మెరుగైన వాతావరణం ఉండేలా ఈ మరమ్మత్తులు చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ....
పోలీస్ కార్యాలయాలు ప్రజలకు భరోసా ఇచ్చేలా ఉండాలని, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా అధికారుల పనితీరులో మరింత పారదర్శకత, వేగం పెరుగుతాయని పేర్కొన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, ప్రజలకు చేరువగా ఉంటూ వారి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని ఆయన వివరించారు. కార్యాలయ ఆధునీకరణ వల్ల అటు సిబ్బందికి, ఇటు ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి అదనపు ఎస్పీ (అడ్మిన్) కే. నరసింహ రెడ్డి , కామారెడ్డి సబ్ డివిజన్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు (CIs), ఎస్ఐలు (SIs) మరియు కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >