Posted on 2026-03-29 21:52:30
అడ్మిషన్ గ్యారంటీ, తక్కువ ఫీజుతో సీటు కల్పిస్తాo అంటూ అమాయక విద్యార్థులు, తల్లిదండ్రులకు సైబర్ నేరగాళ్ల మోసాలు.
కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్
డైలీ భారత్, కర్నూలు : ఇంజనీరింగ్, మెడికల్ మరియు బీటెక్ సీట్ల పేరుతో అడ్వాన్స్ పేమెంట్లు తీసుకుంటూ జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
కొందరు సైబర్ నేరగాళ్లు ప్రముఖ కళాశాలలు, విశ్వవిద్యాలయాల పేరుతో ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్లు, ఫేక్ వెబ్సైట్ల ద్వారా సంప్రదిస్తూ “మేనేజ్మెంట్ కోటా సీట్ల ” పేరుతో అడ్వాన్స్ బుకింగ్ డబ్బులు అడిగి మోసాలు చేస్తారన్నారు.
అడ్మిషన్ గ్యారంటీ, తక్కువ ఫీజుతో సీటు కల్పిస్తామని చెప్పి అమాయక విద్యార్థులు, తల్లిదండ్రులను మోసాలు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయన్నారు .
జిల్లా ప్రజలకు ఎస్పీ సూచనలు...
ఏ కళాశాల సీటు కోసం అయినా అధికారిక వెబ్సైట్ లేదా కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారానే దరఖాస్తు చేయాలి.
ఫోన్ కాల్స్ లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఆఫర్లను నమ్మి డబ్బులు పంపవద్దు.
వ్యక్తిగత బ్యాంక్ వివరాలు, OTPలు ఎవరికీ ఇవ్వకూడదు.
అనుమానాస్పద లింకులు, APK ఫైల్స్ డౌన్లోడ్ చేయవద్దు.
ఎవరైనా సైబర్ మోసానికి గురి అయితే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలి.
జరిగిన సైబర్ నేరం గురించి వెంటనే లేదా ఒక గంటలోపు ఫిర్యాదు చేస్తే మోసపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుందని కర్నూల్ ఎస్పీ తెలిపారు.
విద్యార్థులు మరియు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి, కేవలం అధికారిక విధానాల ద్వారానే అడ్మిషన్లు పొందాలని కర్నూల్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
#APPOLICE100 #AndhraPradeshPolice
#PoliceKurnool #APPolice #appolice
మహిళల భద్రతే లక్ష్యం – ప్రజల్లో చైతన్యం నింపుతున్న కామారెడ్డి షీ టీమ్
Posted On 2026-06-07 13:06:00
Readmore >
ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా “ఫిట్ ఇండియా మూవ్మెంట్” సైక్లింగ్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-07 13:04:42
Readmore >
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >