Posted on 2026-03-11 20:23:40
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ని దేశ రాజధాని ఢిల్లీలో కలిసిన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ కై ABSS (అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్) (extention) విస్తరణ కింద ఓరియంటల్ పాఠశాల నుండి దర్శన్ థియేటర్ ముందు వరకు అభివృద్ధి చేయాలని దాని కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కేంద్ర రైల్వే మంత్రి కి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు.
అలాగే పాత రైల్వే క్వార్టర్ లను తొలగించి కొత్తగా వివేకానంద కాలనీ వైపు నిర్మించాలని, అలాగే స్టేషన్ రోడ్ వైపు ఉన్న రైల్వే భవనాలు వివేకానంద కాలనీ వైపు నిర్మించాలని అలాగే నూతన రైల్వే భవనం మరియు ఫుట్ ఓవర్ బ్రిడ్జి కి సంబందించిన ప్లాన్స్ పూర్తి అయ్యాయని మంత్రి నుండి సానుకూల స్పందన వచ్చిందని వాటి నిర్మాణానికి ప్లాన్స్ పూర్తి చేసి ప్లాన్స్ డిపార్ట్మెంట్ నుండి కనస్ట్రక్షన్ డిపార్ట్మెంట్ పంపారని త్వరలోనే నిధులు కేటాఇస్తూ అనుమతులు కూడా ఇస్తామని కేంద్ర రైల్వే మంత్రి స్వయంగా తెలిపారు
అంతే కాకుండా జిల్లా కేంద్రంలో మూడు చోట్ల ROB రోడ్ ఓవర్ బ్రిడ్జి ల ఏర్పాటు చేయాలని గతంలో చేసిన వినతులకు స్థల పరిశీలన, జాయింట్ ఇన్స్పెక్షన్ సాయిల్ టెస్టింగ్ అన్ని త్వరలో పూర్తి చేయాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు
అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో పనులు ప్రారంభమై రెండు సంవత్సరాల లోపు పనులు పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని అన్నారు. ఈ విషయంలో తనకు పూర్తిగా సహకారం అందిస్తున్న కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ విషయంలో సహకరించిన మాజీ కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల కి శాసన సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >