Posted on 2026-02-24 09:41:29
షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మద్యం బాటిల్ ప్రత్యక్షం
కొబ్బరి బోండాలకు అనుమతులు లేవు కానీ కోటర్ సీసాలకు ?
నిబంధనలు కేవలం బోర్డులకేనా?
ప్రమాదకరంగా మారిన బయో మెడికల్ వేస్ట్
ఆసుపత్రిలో పలుచోట్ల దర్శనమిస్తున్న ఇంజక్షన్లు మెడికల్ వేస్టేజ్
డైలీ భారత్, షాద్నగర్, రంగారెడ్డి జిల్లా:
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ప్రాణదానం చేయాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి, అధికారుల నిర్లక్ష్యం వల్ల రోగాలకు నిలయంగా మారుతోంది. షాద్నగర్ పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) లో పారిశుధ్యం పడకేసింది. నిబంధనల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెడుతున్న అధికారులు, ఆసుపత్రి లోపల జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను మాత్రం గాలికొదిలేశారు.
నిబంధనలు కేవలం బోర్డులకేనా?
ఆసుపత్రి లోపలికి కొబ్బరిబోండాలను తీసుకురాకూడదని పెద్ద పెద్ద బోర్డులు పెట్టిన యాజమాన్యం, అదే ఆసుపత్రి రెండో అంతస్తులో దర్శనమిస్తున్న మద్యం సీసాలను ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రోగులు కోలుకోవడానికి తాగే కొబ్బరినీళ్లపై ఉన్న నియమం, మందు బాటిళ్లపై లేదా? అని పౌరులు మండిపడుతున్నారు.
ప్రమాదకరంగా మారిన బయో మెడికల్ వేస్ట్
ఆసుపత్రి ఆవరణలో ఎక్కడ చూసినా వాడిన ఇంజక్షన్ సూదులు, సిరంజీలు, మెడికల్ క్రీములు కుప్పలుగా పడి ఉన్నాయి. నిబంధనల ప్రకారం వీటిని సురక్షితంగా ధ్వంసం చేయాలి, కానీ ఇక్కడ మాత్రం బహిరంగంగా పడేయడం వల్ల చిన్నారులకు, రోగులకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం పొంచి ఉంది. స్వచ్ఛ భారత్ నినాదం ఈ ఆసుపత్రి గడప కూడా దాటలేదని ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది.
బాధ్యులపై వేటు పడాల్సిందే!
ఆసుపత్రిలో మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయి? సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు? పారిశుధ్యం నిర్వహించాల్సిన వారు నిద్రిస్తున్నారా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలివరణలో ఎక్కడ చూసినా వాడిన ఇంజక్షన్ సూదులు, సిరంజీలు, మెడికల్ క్రీములు కుప్పలుగా పడి ఉన్నాయి. నిబంధనల ప్రకారం వీటిని సురక్షితంగా ధ్వంసం చేయాలి, కానీ ఇక్కడ మాత్రం బహిరంగంగా పడేయడం వల్ల చిన్నారులకు, రోగులకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం పొంచి ఉంది. స్వచ్ఛ భారత్ నినాదం ఈ ఆసుపత్రి గడప కూడా దాటలేదని ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది.
బాధ్యులపై వేటు పడాల్సిందే!
ఆసుపత్రిలో మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయి? సెక్యూరిటీ సిబ్బంది ఏం ? పారిశుధ్యం నిర్వహించాల్సిన వారు నిద్రిస్తున్నారా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి.
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >
అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!
Posted On 2026-04-08 17:33:40
Readmore >
గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.
Posted On 2026-04-08 17:28:46
Readmore >
వరద ముంపునకు గురైన గిరిజన గురుకుల పాఠశాల నాగిరెడ్డిపేట్ కు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం
Posted On 2026-04-08 13:14:54
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్కు తరలింపు
Posted On 2026-04-08 12:27:46
Readmore >