Posted on 2026-02-23 13:58:10
మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షలు, జరిమానాలు తప్పవు... తస్మాత్ జాగ్రత్త.
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం – ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
గడిచిన 20 రోజులలో సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలో 364 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
డైలీ భారత్, సిరిసిల్ల: మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని,జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా విస్తృతంగా ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని డిఎస్పీ తెలిపారు.
ఈసందర్భంగా డిఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ....
సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రతి రోజు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఇందులో భాగంగా గడిచిన 20 రోజులలో సబ్ డివిజన్ పరిధిలో 364 మoదిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.
మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదాలకు కారణమైన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటుగా కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఆ యొక్క లైసెన్స్ రద్దుకు సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిఫారసు చేయడం జరుగుతుందని, జిల్లాలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడంతో పాటుగా,మద్యం సేవించి పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తూ ప్రజలలో అవగాహన కల్పిస్తున్నామన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పాల్గొన్న పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ,ట్రాఫిక్ ఎస్.ఐ శ్రీకాంత్,సిబ్బంది పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >