Posted on 2026-01-10 13:00:10
సావిత్రిబాయి ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఉద్యోగ–ఉపాధ్యాయ పురస్కారాలు–2026 కార్యక్రమం శనివారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ—మహిళా విద్యకు మార్గదర్శకురాలైన సావిత్రిబాయి పూలే ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, యువత నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని గుర్తుచేశారు.
0–3 ఏళ్ల చిన్నారులకు పౌష్టికాహారం, ప్రీ-ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటు, యువత కోసం స్కిల్ యూనివర్సిటీ, మహిళల కోసం మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ప్రభుత్వ సంకల్పమని అన్నారు. గేమ్స్, జోన్-స్థాయి టోర్నమెంట్ల ద్వారా యువతను ఆరోగ్యవంతంగా ఉంచే చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపినా, కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. ప్రభుత్వ స్కూళ్లు ప్రైవేటు స్కూళ్లకు పోటీగా నిలుస్తున్నాయని, పదో తరగతి ఫలితాల్లో శాతానికి శాతం ఉత్తీర్ణత రావడం గర్వకారణమని అన్నారు.
మహిళలకు వడ్డీరహిత రుణాలు, ఉపాధ్యాయ నియామకాలు, గృహ నిర్మాణ పథకాలపై ప్రభుత్వ కట్టుబాటు కొనసాగుతోందని వెల్లడించారు.
కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు వినోద్, నాయకులు నరాలు సుధాకర్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీఈఓ అశోక్, మాజీ జెడ్పీ చైర్మన్ విట్టల్ రావు, కాంగ్రెస్ నాయకులు అగ్గు భోజన్న, రామచంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >