| Daily భారత్
Logo




వైరాలోనే ఆర్టీవో కార్యాలయాన్ని కొనసాగించాలి

News

Posted on 2026-01-09 17:30:13

Share: Share


వైరాలోనే ఆర్టీవో కార్యాలయాన్ని కొనసాగించాలి

ఆర్టీవో కార్యాలయం వద్ద సిపిఎం(ఎం) నిరసన 

 బోనకల్‌కు మార్చితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం హెచ్చరిక.

అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి దినేష్ కు వినతి

డైలీ భారత్, వైరా:వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలకు విశేషంగా సేవలు అందిస్తున్న వైరా ఆర్టీవో కార్యాలయాన్ని వైరా నియోజకవర్గ కేంద్రంలోనే కొనసాగించాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భుక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. వైరా ఆర్టీవో బోనకల్ కు మార్చితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం ఆర్టీవో కార్యాలయాన్ని బోనకల్ కు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీవో కార్యాలయం వద్ద సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి.దినేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు . ఈ సందర్భంగా పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భుక్యా వీరభద్రం మాట్లాడుతూ గత 27 సంవత్సరాలుగా వైరా కేంద్రంగా ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే విధంగా సేవలందిస్తున్న రవాణా శాఖ కార్యాలయాన్ని వైరా నుంచి మధిర నియోజకవర్గం బోనకల్‌కు మార్చాలనే ప్రభుత్వ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. వైరాలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా కార్యాలయాన్ని బోనకల్ కు తరలించడాన్ని సిపిఐ(ఎం) పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. నిర్ణయం వల్ల వైరా, కొణిజర్ల, తల్లాడ, ఎన్కూరు మండలాల ప్రజలకు రవాణా సేవలు అందనంత దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బోనకల్ మండల కేంద్రంలో ఆర్టీవో కార్యాలయం ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆదేశాల మేరకు గురువారం బోనకల్ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం వెనుక ఉన్న స్థలాన్ని వైరా ఎంవిఐ వరప్రసాద్, తహసిల్దార్ రమాదేవి, యుడిసి ఉపేందర్ పరిశీలించారని తెలిపారు. బోనకల్ కు కొత్త ఆర్టీవో కార్యాలయం మంజూరు చేయాలని సూచించారు. వైరాలో ఉన్న రవాణా శాఖ కార్యాలయాన్ని వైరాలోనే కొనసాగించాలని కోరారు. బోనకల్ కు మార్చడం వల్ల వేలాది మంది  ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేదంటే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, రూరల్ కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు, డివిజన్ కార్యదర్శివర్గ సభ్యురాలు మచ్చా మణి, నాయకులు గుడిమెట్ల రజిత, పైడిపల్లి సాంబశివరావు, గుడిమెట్ల మోహన్ రావు, కొంగర సుధాకర్, షేక్ నాగుల్ పాషా, తోట కృష్ణవేణి, మందడపు రామారావు, మల్లెంపాటి ప్రసాదరావు, మాడపాటి రామారావు,యనమద్ది రామకృష్ణ, అమరనేని  కృష్ణ, పానుగంటి రాంబాబు, మాడపాటి వెంకటేశ్వరరావు, మాడపాటి సుజాత, చావా కళావతి తదితరులు పాల్గొన్నారు.

Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >
Image 1

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

Posted On 2026-06-05 20:42:30

Readmore >
Image 1

కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

Posted On 2026-06-05 20:39:30

Readmore >
Image 1

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

Posted On 2026-06-05 20:23:17

Readmore >
Image 1

దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్

Posted On 2026-06-05 20:16:20

Readmore >
Image 1

ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్‌ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు

Posted On 2026-06-05 20:14:05

Readmore >