Posted on 2026-01-04 15:51:55
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా తల్లాడ మండలంసమాజంలో ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలు పాటించి, ప్రమాదాలను నివారించాలని తల్లాడ ఎస్సై వెంకటకృష్ణ సూచించారు. సత్తుపల్లి ఏసిపి ఆదేశాల మేరకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా తల్లాడ పట్టణంలో వాహనదారులకు హెల్మెట్ ధరించటంపై బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాలని సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుండి తల్లాడ పట్టణంలోని ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించి అవగాహన కల్పనలో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించినట్లు వెల్లడించారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు అని సూచించారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ను తప్పనిసరిగా వాడాలన్నారు. రాజకీయ పార్టీల నాయకులు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వాహనదారులు ర్యాలీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై 2 వెంకటేష్, కానిస్టేబుల్స్, రాజకీయ నాయకులు యువకులు పాల్గొన్నారు.
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >