Posted on 2025-12-24 20:02:32
తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్స్ జెఎసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తులసి సత్య నారాయణ
డైలీ భారత్ న్యూస్, రాజన్న సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ సంయుక్త కార్యచరణ సమితి రాష్ట్ర పిలుపుమేరకు 2024 మార్చి నుండి ఇప్పటివరకు ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా రేవా అధ్యక్షులు మల్లారపు పురుషోత్తం అధ్యక్షతన నిరాహార దీక్ష కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లాకలెక్టర్ ఆఫీస్ ఎదుట చేపట్టడం జరిగింది
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్స్ జేఏసీ ప్రధాన కార్యదర్శి తులసి సత్యనారాయణ మాట్లాడుతూ2024 మార్చ్ నుండి దాదాపు 21 మాసంలు గడిచినా కూడా ఉద్యోగ, ఉపాధ్యాయులకు జిపిఎఫ్, జిఐఎస్, లీవ్ ఎన్కాష్మెంట్, కమిటే షన్ మరియు గ్రాచూ టీ ప్రభుత్వం నుండి అందలేదని అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వెంటనే రావలసిన బకాయిలు అందక తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలో దాదాపు 32 మంది ఉద్యోగస్తులు బకాయిలు రాక మానసిక ఆవేదనకు గురై మరణించారని తెలిపారు. ఇట్టి ప్రయోజనాల విషయమే ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించిన, నిరసన, ధర్నా కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. అందుకే ప్రభుత్వం పై ఉద్యోగ ఉపాధ్యాయుల బకాయలు చెల్లింపు కొరకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా రేవా అధ్యక్షులు మల్లారపు పురుషోత్తం మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వచ్చేంతవరకు పోరాటం చేస్తామని అవసరమైతే హైదరాబాదులో అమర ణ నిరాహార దీక్ష చేపడతామని వారు తెలిపారు.
ఇట్టి నిరాహార దీక్ష కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ధ్యాన పెళ్లి పరమేష్, జిల్లా ఉపాధ్యక్షులు వంగ సుధాకర్, జన పాల వెంకటయ్య కోశాధికారి ధర్మయ్య, సంఘ సభ్యులు ఎస్ఆర్జే వెంకటేశ్వర్లు ప్రభాకర్, సాన రవీందర్, కుబేర స్వామి, రెహమాన్, రిటైడ్ పి జి హెచ్ ఎం తిరుపతి, అమీరుద్దీన్, చొప్పదండి రవీందర్, రాఘవేంద్రరావు, గడీల రమేష్,రిటైర్డ్ సిడిపిఓ ఆనందిని, కే జయశ్రీ, ఘీభావం తెలిపిన వివిధ సంఘాల నాయకులు భాగ్యరేఖ నెహ్రు నగర్ పి జి హెచ్ ఎం., హరి ప్రసాద్ ఎస్ జి టి సంఘ జిల్లా అధ్యక్షుడు, చేపూరి శ్రీనివాస్ జిల్లా హెల్త్ గెజిటెడ్ సంఘం అధ్యక్షుడు, టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుమాలరామనాథ్, తపస్సు జిల్లా అధ్యక్షుడు జయకృష్ణ, ఎస్సీ ఎస్టీ సంఘమం జిల్లా అధ్యక్షుడు పిట్టల దేవరాజ్, డిటిఎఫ్ జిల సుధాకర్ రెడ్డ, బి టి ఎఫ్ జిల్లా సంఘ బాధ్యులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >