Posted on 2025-12-24 19:05:47
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:బంగ్లాదేశ్ లో హిందువుల పై జరుగుతున్న హింసకు, మారణహోమానికి నిరసనగా ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లో గల జిల్లా కలెక్టరేట్ వద్ద విశ్వహిందూ పరిషత్- బజరంగ్దళ్, దుర్గావాహిని ఆద్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించి కలెక్టర్ కార్యాలయం లోని పరిపాలన అధికారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది, ఈ సందర్బంగాబంగ్లాదేశ్ లోని హిందువులకు రక్షణ కల్పించాలనీ, బంగ్లాదేశ్ లో జరుగుతున్న మతోన్మాద జీహాదీల దాడులను యవత్ ప్రపంచఖండించాలనీకార్యకర్తలు నినాదాలు చేశారు, అనంతరం విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర మందిర అర్చక పురోహిత్ సహ ప్రముఖ్ వోరుగంటి సురేష్ కుమార్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం వెంటనే స్పందించి బంగ్లాదేశ్ లోని హిందువులను రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలనీ, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ లాంటి చర్యలకు పూనుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తుందని అన్నారు,ఈ కార్యక్రమం లో విశ్వహిందూ పరిషత్ ఖమ్మం విభాగ్ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు , విభాగ్ మాతృశక్తి సంయోజిక రేగడి విజయలక్ష్మి , జిల్లా ఉపాధ్యక్షులు రామాయణం శర్మ , జిల్లా ఉపాధ్యక్షులు దారా రమేష్ , జిల్లా సంఘటన కార్యదర్శి గంగాధరి సీత , జిల్లా బజరంగ్దళ్ సంయోజక్ కూసన సాగర్ గారు, బజరంగ్దళ్ జిల్లా సహ సంయోజక్ మధుసూదన చారి , జిల్లా దుర్గావాహిని సంయోజిక గంగాధరి ఇందుమతి , దుర్గావాహిని జిల్లా సహ సంయోజిక గొడ్ల ఇందుమతి గారు, దుర్గావాహిని జిల్లా బాల సంస్కార కేంద్ర ప్రముఖ్ గొడ్ల సాయిశ్రీ , జిల్లా సామాజిక సమరసతా ప్రముఖ్ గొడ్ల రాజయ్య , బజరంగ్దళ్ కొత్తగూడెం నగర సంయోజక్ కిరణ్ , బజరంగ్దళ్ పాల్వంచ ప్రఖండ సంయోజక్ రామగిరి ప్రసాద్ , పాల్వంచ ప్రఖండ కార్యదర్శి దాసరి మాధవరావు గారు, పాల్వంచ ప్రఖండ ఉపాధ్యక్షులు చల్లా లింగన్న గారు, పాల్వంచ ప్రఖండ మాతృశక్తి సంయోజిక మందా వెంకటరమణ గారు, పాల్వంచ ప్రఖండ మందిర అర్చక పురోహిత్ ప్రముఖ్ రాజాచార్యులు , భద్రాచలం ప్రఖండ అధ్యక్షులు తాటిపాముల తిరుపతి రావు గారు, భద్రాచలం ప్రఖండ కార్యదర్శి కొమర్రాజు నాగేశ్వరరావు గారు, కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలి : ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు
Posted On 2026-04-13 11:03:05
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >