Posted on 2025-11-22 18:44:34
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : డిసెంబర్ 8 మరియు 9 తేదీలలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్కు సంబంధించిన పనులను ఎటువంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం వేల్కుంట తాండలో డిసెంబర్ 8 మరియు 9 తేదీలలో గ్లోబల్ సమ్మిట్ జరగనున్న ప్రాంతాన్ని శనివారం కలెక్టర్ పరిశీలించారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లను, హెలిప్యాడ్ పనులను ఆయన పరిశీలించారు. గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన పనులను ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, ఏసీపీ కె.వి. రాజు, ఎంఆర్ఓ గోపాల్, విద్యుత్ శాఖ అధికారులు, ఇతర సంబంధిత విభాగాల అధికారులు, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >