Posted on 2025-10-16 22:21:04
డైలీ భారత్ న్యూస్, నర్సంపేట/నల్లబెల్లి : సమాజంలో ప్రతి ఒక్కరూ హెచ్ఐవి పైన అవగాహన కలిగి ఉండాలని నల్లబెల్లి వైద్య అధికారి పిబి ఆచార్య, వై ఆర్ జి కేర్ లింక్ వర్కర్ స్కీమ్ డిఆర్పి ఎండి ముస్తాక్ అన్నారు. నల్లబెల్లి మండల కేంద్రంలో గురువారం లింక్ వర్కర్ స్కీం ఆధ్వర్యంలో నిర్వహించిన హెచ్ఐవి పై అవగాహన ర్యాలీని నల్లబెల్లి మండల వైద్య అధికారి ఆచార్య జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. హెచ్ఐవి నాలుగు మార్గాల ద్వారానే వ్యాప్తి చెందుతుంది అసురక్షిత లైంగిక సంబంధాలు, కలుషితమైన రక్తమార్పిడి, కలుషితమైన సూదులు చిరంజీలు, హెచ్ఐవి ఉన్న తల్లిదండ్రులకు పుట్టే పిల్లలకు వ్యాపిస్తుందని అన్నారు. మరి ఏ పద్ధతుల ద్వారా హెచ్ఐవి వ్యాపించదు. హెచ్ఐవి వారిపట్ల వివక్షత చూపకుండా మనలో ఒకరిగా ఆదరించాలని కోరారు. అనంతరం మండల కేంద్రంలోని మండల సమైక్య కార్యాలయంలో నిర్వహించిన వివో మీటింగులో డిఆర్పి ముస్తాక్ మాట్లాడుతూ హెచ్ఐవి, ఎస్.టి.ఐ వ్యాప్తి, నివారణ మార్గాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వై ఆర్ జి కేర్ మిల్క్ వర్కర్ స్కీం ప్రతినిధులు సామల వీరన్న, జరుపుల లింగన్న, మురళి, స్థానిక యువకులు, గ్రామ పెద్దలు, వైద్య సిబ్బంది, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >