Posted on 2025-10-16 18:45:03
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం జక్రాన్పల్లి మండలంలోని ఆర్గుల్, మునిపల్లి గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా తెలంగాణ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను గురువారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మునిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి పనుల కోసం రూ.2 కోట్ల 29 లక్షల నిధులను మంజూరు చేశామని తెలిపారు. మునిపల్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం రైతులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం మొక్కజొన్న కనీస మద్దతు ధరను క్వింటాల్కు రూ.2400గా నిర్ణయించిందని, ఈ కేంద్రాల ఏర్పాటుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక కృషి చేశారని తెలిపారు. మహిళల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, సోలార్ ప్లాంట్లు, వడ్డీ లేని రుణాలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరా శక్తి క్యాంటీన్ వంటి పథకాల ద్వారా మహిళలకు అండగా ఉంటోందని చెప్పారు. బీసీ 42 శాతం రిజర్వేషన్కు బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయని, శాసనసభలో చట్టం చేసి గవర్నర్కు, కేంద్రానికి పంపిన బిల్లు బిజెపి, బిఆర్ఎస్ ఎంపీలు అడ్డుకుంటున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధి కొనసాగించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి సంక్షేమ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల కలలు నిజమవుతున్నాయని చెప్పారు. మన నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మునిపల్లి గ్రామంలో మహిళా భవన్,లక్ష్మి నరసింహస్వామి ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఐసిడిఎంఎస్ చైర్మన్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, అర్గుల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గంగారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్నారెడ్డి, మాజీ సర్పంచ్ చిన్న సాయి రెడ్డి, యూత్ నాయకుడు వినోద్, తహసీల్దార్ కిరణ్మయి, సంఘ డైరెక్టర్లు, సిబ్బంది, రైతులు , మహిళలు తదితరులు పాల్గొన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >