Posted on 2025-09-27 06:39:35
వరంగల్ / నర్సంపేట, డైలీ భారత్ న్యూస్: మనిషి కూడా ప్రకృతిలో ఓ భాగమే అన్న విషయం మర్చిపోతున్న రోజులివి. కాలంతోపాటు సాంకేతికతతో యంత్రాల నడుమ అసలు ప్రకృతి ఉనికినే ప్రశ్నార్థకంగా చేస్తున్న కాలమిది. ప్రస్తుత సమాజంలో ఎక్కడో ఒకచోట కన్న పిల్లల్ని కూడా చూడకుండా కడతేరుస్తున్న ఈ సంస్కృతికి చంపపెట్టుల వినూత్నంగా ఓ మూగజీవిని సాకి ఆపై పెంచుకున్న ప్రేమను ఒకంతగా ప్రస్తుత ప్రపంచానికి నిలువెత్తు సాక్షగా ప్రేమను అమ్మతనాన్ని అమ్మానాన్నల బంధాన్ని మూగజీవులను ప్రేమించే దిశగా చూపేందుకు ఓ వినూత్న కార్యక్రమం చేపట్టి ఆ మూగజీవికి అమ్మ నాన్నల వెన్నంటే ఉండి సీమంతం చేసి ప్రకృతిలోని జీవులతో మనిషికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారు కొందరు. అందులో భారతీయ సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉన్న గోవుల కోసం కొంతమంది మానవతామూర్తులు గోశాలలు నిర్వహిస్తున్నారు. అలాంటి ఓ గోశాల ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత హనుమకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రం చింతగట్టులోని మహర్షి గోశాల నుండి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం దాసరి పల్లె గ్రామానికి చెందిన పెండ్యాల సురేందర్ వృత్తిరీత్యా గత 30 సంవత్సరాల నుండి గోపాలమిత్రగా పనిచేస్తున్నాడు గోవుల మీద పెంచుకున్న మమకారంతో ఒక సంవత్సరం వయసు గల గోవుని ఐదు సంవత్సరాల క్రితం తెచ్చుకొని గౌరీగా నామకరణం చేసి పోషిస్తున్నాడు. ఈ క్రమంలో యుక్త వయసుకు వచ్చిన (గోవు). గౌరికి కృత్రిమ గర్భాధారణ చేపించి గర్భం దాల్చి ఆరు నెలల నుండి ఏడవ నెల పడిన క్రమంలో రెండు రోజుల క్రితం గ్రామం లోని ప్రతి ఇంటికి వెళ్లి గౌరీ సీమంతానికి అతిధులను ఆహ్వానించే కార్యక్రమం చేపట్టి శుక్రవారం రోజు సురేందర్ ఇంటి ఆవరణంలో ఘనంగా అంగరంగ వైభవంగా సీమంతం ఏర్పాట్లు ఏర్పాట్లు చేసారు. ఈ కార్యక్రమం లో పెండ్యాల సురేందర్ మాట్లాడుతూ గోమాతను హిందువులు దేవతగా భావిస్తారు, అందుకే ఈ ఆరాధన.
ప్రకృతిలోని జీవుల పట్ల మనిషికున్న అనుబంధాన్ని గుర్తుచేసేందుకు ఇలా చాలా చోట్ల చేయడంజరిగిందని.గోవును పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తాయని నమ్మకంతో కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం మొదట గా ఇంటి ఆడబిడ్డగా భావించిన (గౌరీకి) గోమాతకు పసుపు కుంకుమ రాసి నూతన వస్త్రాలు సమర్పించి, గోకుల దక్షణాలు చేశారు. అర్చకులు మంత్రాలు చదువుతూ మంత్రోచ్ఛారణతో పూజలు నిర్వహించగా,స్థానిక
మహిళలు గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేసి, అక్షింతలు వేసారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. అనంతరం వేడుకలో పాల్గొన్న అందరికీ తీర్ధప్రసాదాలు, అన్నదానం ఏర్పాటు చేశారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలి : ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు
Posted On 2026-04-13 11:03:05
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >