Posted on 2023-12-29 18:14:38
సిరిసిల్ల జర్నలిస్టులకు ఆరు మాసాల్లో ఇండ్ల పట్టాలు నిర్మాణాలు
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పాటుపడుతామని, పట్టాలు రాని జర్నలిస్టులకు పట్టాలు ఇప్పించడంతోపాటు జర్నలిస్టులు అందరికీ ఇండ్ల నిర్మాణానికి ఆరు మాసాలలోపు పరిష్కరించడం జరుగుతుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి లను ప్రెస్ క్లబ్ పాలకవర్గం, సభ్యులు శాలువాతో సత్కరించారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని అధికారంలోకి రాకముందే హామీ ఇచ్చామని గుర్తుచేశారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీ ప్రకారం ఇంటి స్థలాలతో పాటు ఇండ్లను కూడా ప్రభుత్వం నిర్మించి ఇస్తుందని హామీ ఇచ్చారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉండి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆకుల జయంత్, ప్రధాన కార్యదర్శి పరకాల ప్రవీణ్ కుమార్, రఘు రాపెళ్లి భాస్కర్ కాయితి మహేందర్ సీనియర్ జర్నలిస్టులు కరుణాల భద్రాచలం, తడుక విశ్వనాథం టివి నారాయణ, రాపెళ్లి సంతోష్ కుమార్, ఊరడి మల్లికార్జున్ రాచ లక్ష్మణ్ మిట్టపల్లి కాశీనాథ్ కాంబోజి ముత్యం మేడి కిషన్ ప్రెస్ క్లబ్ పాలకవర్గం సభ్యులు అల్లే రమేష్ నాయిని బాబు రాజా రమేష్ ఆన్సర్ అలీ దయానంద్ శిరీష నాలుగు పాల్గొన్నారు.
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >