Posted on 2025-09-19 17:42:30
డైలీ భారత్, సిరిసిల్ల: ఈ రోజు స్థానిక సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సిరిసిల్ల యందు ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు ప్రథమ సంవత్సరం విద్యార్థినులకు స్వాగతం పలుకుతూ ఇచ్చే ఫ్రెషర్స్ పార్టీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది.
కళాశాల ప్రిన్సిపాల్ G. వనజా కుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి Y. శ్రీనివాస్ విచ్చేయడం జరిగింది.DIEO మాట్లాడుతూ విద్యార్థినులు ఒక ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరుచుకొని ఆ లక్ష్య సాధన దిశగా కష్టపడి చదువాలని అన్నారు. ఈ కళాశాల విద్యార్థినులు మంచి మార్కులతో రాష్ట్ర స్థాయి లో ర్యాంక్ లు తీసుకురావడం జరిగిందని వారికి అభినందనలు తెలియచేస్తూ ఈ సంవత్సరం కూడా ఇంకా అద్భుతమైన ఫలితాలు తీసుకొని రావాలని అన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ...
ప్రపంచంలో చదువుకు మించిన సంపద ఏది లేదని ముఖ్యంగా అమ్మాయిలు ఉన్నత చదువులు చదువుకొని సమాజంలో ఉన్నత స్థానంలో నిలబడాలని తెలిపారు. అనంతరం విద్యార్థినులు ఆటపాటలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్స్ మురళీ, సీతారాము, k. సునీత, ఆఫ్రోజ్ సుల్తానా,శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, నవీన్ కుమార్, జబిఉల్లా,M. సునీత, గంగరాజు, కృష్ణవేణి , ఆఫీస్ సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >