Posted on 2023-12-20 16:18:06
సొంత పార్ట్నర్ లూటీ చేశాడని బాధితుడు ఆవేదన
డైలీ భారత్, సిరిసిల్ల :సొంత పార్ట్నర్ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి 26 లక్షలు లూటీ చేశాడని సిరిసిల్ల పట్టణానికి చెందిన బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బాధితుడు గుగ్గిళ్ళ జగన్ గౌడ్ బుధవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆధారాలతో సహా వివరాలు వెల్లడించారు. పట్టణంలోని వికాస్ డిగ్రీ, పీజీ కళాశాలలో తనకు 52% భాగస్వామ్యం ఉన్నదని, తనకు తెలియకుండా కళాశాల ప్రిన్సిపల్, బిఆర్ఎస్ నేత దిడ్డి శ్రీనివాస్ తాను పట్టణంలో లేని సమయం చూసి తన సంతకాన్ని ఫోర్జరీ చేసి 26 లక్షల రూపాయలను లూటీ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబరు 10 నుండి అక్టోబర్ 13 వరకు అమెరికాలోని తన కూతురి దగ్గరికి వెళ్లానన్నారు. ఇదే అదునుగా భావించిన శ్రీనివాస్ జాయింట్ సంతకం తో కూడిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంటు నుండి 26 లక్షల రూపాయలు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి డ్రా చేశాడని, అంతేకాకుండా రాజరాజేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ ఖాతాలో ఐదుగురు సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి అకౌంట్ కూడా క్లోజ్ చేశాడన్నారు. బిఆర్ఎస్ నేత ప్రిన్సిపల్ దిడ్డి శ్రీనివాస్ సొసైటీ మెంబర్, సెస్ డైరెక్టర్ దిడ్డి రమ ఇరువురిపై సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు తెలిపారు. సంతకాలు ఫోర్జరీ చేసిన దిడ్డి శ్రీనివాస్ ఆయన భార్య దిడ్డి రమపై చట్టపరమైన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని పోలీసు శాఖను జగన్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >