Posted on 2023-12-20 09:20:06
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: కోణార్క్ హాస్పిటల్ కి చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ సింహారెడ్డి(MBBS,MD,DNB) వారి టీమ్ తో కలిసి పోలీస్ బెటాలియన్ సిబ్బందికి నరాల బలహీనత, వెన్నెముక మరియు మెదడు యెక్క రుగ్మతల గురించి అవగాహన కల్పించారు. వివిధ రకాల టెస్టులు నిర్వహించారు. వ్యాధికి గల కారణాలు - నివారణలను వివరించారు. సిబ్బందికి గల అనుమానాలు నివృత్తి చేసి తగు సలహాలు సూచనలు చేశారు.
ఈ సందర్బంగా బెటాలియన్ కమాండెంట్ యస్.శ్రీనివాస రావు మాట్లాడుతూ "హెల్త్ ఈజ్ వెల్త్ " అని పోలీస్ సిబ్బంది యొక్క విధులు మిగతా వారితో పోల్చినప్పుడు భిన్నంగా ఉంటాయని, ఎల్లప్పుడూ విధి నిర్వహణలో ఉండటం వల్ల హెల్త్ గురుంచి కేర్ తీసుకునే టైమ్ ఉండదు కానీ ప్రతి ఒకరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుని వ్యాయామం, యోగ లాంటివి చేయాలనీ అన్నారు.సిబ్బంది అందరూ ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా కోణార్క్ హాస్పిటల్ వైద్య బృందానికి కమాండెంట్ యస్. శ్రీనివాస రావు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ ఎ.జె.పి నారాయణ, యమ్.పార్థసారథి రెడ్డి, అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >