| Daily భారత్
Logo




ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి దారుణ హత్య

News

Posted on 2023-12-19 05:32:09

Share: Share


ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి దారుణ హత్య

డైలీ భారత్, కామారెడ్డి: పక్కనే ఉన్న మరో ఇంటిని కాజేయడానికి ప్రయత్నించి కుటుంబాన్ని తమ్ముడితో కలిసి మట్టుబెట్టిన ఘటన కామారెడ్డి జిల్లా, సదాశివ నగర్‌లో వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనంప్రకారం. నిందితులు ఒకే కుటుం బానికి చెందిన ఆరుగురిని పదిహేను రోజ ల్లోనే అత్యం త పాశవికంగా హత్య చేసి ఒక్కొక్క మృత దేహాన్ని ఒక్కో వైపు పడేసి ఎవరికీ అనుమానం రాకుం డా జాగ్రత్తపడ్డారు.

ఎట్టకేలకు నిందితుడిని గుర్తించిన పోలీసులు వరుస హత్య కేసుల దర్యాప్తులను కొలిక్కి తెచ్చే పనిలో ఉన్నా రు. నిందితులు ఇవి కాక ఏవైనా హత్యలకు పాల్ప డ్డారఅని ఆరా తీస్తున్నారు.

సదాశివనగర్ మండలం, గాంధారి రోడ్‌లో సగం కాలిపోయిన ఓ యువతి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఆ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ వరుస హత్య కేసులు వెలుగులోకి వచ్చాయి.

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలానికి చెందిన ప్రసాద్ అనే యువకుడు కొన్నేళ్ల క్రితం భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెల్లతో కలిసి కామారెడ్డి జిల్లా, మాచా రెడ్డికి మకాం మార్చాడు.

ప్రసాద్‌కి మాక్లూర్‌లో సొంత ఇల్లు ఉంది. ప్రసాద్ ఇంటి పక్కనే ఉండే ఓ వ్యక్తి ఆ ఇంటిమీద కన్నేశాడు. ప్రసా ద్‌తో స్నేహంగా ఉంటూనే, అతని కుటుంబం మొత్తాన్ని మట్టుబెడితేనే ఆ ఇల్లు తన సొంతం అవుతుందని కుట్ర పన్నాడు.

తన తమ్ముడితో కలిసి ప్రసాద్ కుటుంబాన్ని హత్య చేయడానికి సిద్ధమ య్యాడు. ఆ ఇంటి విషయంలో మాట్లాడాల్సి ఉందని చెప్పి ప్రసాద్‌ను సదాశివనగర్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు.

ప్రసాద్ సదాశివనగర్ పోలీ సు స్టేషన్‌లో ఉన్నాడని నమ్మించి ఆయన భార్యను మాచారెడ్డి నుంచి తీసుకెళ్లి సదాశివనగర్ దగ్గర గల అటవీ ప్రాంతంలో హత్య చేసి బాసర గోదావరిలో విసిరేసినట్లు నిందితుడు విచారణలో వెల్లడించాడు.

ప్రసాద్ ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు చెల్లెళ్లను సైతం అతి కిరాతకంగా హత్య చేసి వేర్వేరు ప్రాంతాల్లో పడేశా డని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >
Image 1

చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...

Posted On 2026-08-07 15:27:03

Readmore >
Image 1

మున్సిపల్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి...

Posted On 2026-08-07 14:59:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి

Posted On 2026-08-07 14:58:17

Readmore >
Image 1

మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ

Posted On 2026-08-07 14:55:55

Readmore >
Image 1

పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-07 14:53:14

Readmore >
Image 1

"ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...

Posted On 2026-08-07 12:34:53

Readmore >
Image 1

హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

Posted On 2026-08-07 12:07:52

Readmore >
Image 1

భర్తను చంపేందుకు భార్య, ప్రియుడి కుట్ర...

Posted On 2026-08-07 11:48:51

Readmore >