Posted on 2025-07-11 21:44:44
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ధన్ పాల్ శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ నెల 6న జరిగిన పోలింగ్ ఓట్ల లెక్కింపు శుక్రవారం జరిగింది. ఆయన తన సమీప ప్రత్యర్థి మాజీ జిల్లా, నగర అధ్యక్షుడు అర్వపల్లి పురుషోత్తం గుప్త పై 888 ఓట్లతో గెలుపొందారు. ఈ నెల 6న జరిగిన పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలతో పాటు మాణిక్ భవన్ ( శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల) పాలకమండలి, ఆర్య వైశ్య భవన్ కళ్యాణ మండపం, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటిలకు ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికలు పారదర్శకంగా జరుగలేదని గోడవలు జరిగాయి. ఎన్నికల అధికారులకు పరస్పరం పిర్యాదులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 7న జరగాల్సిన ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం జరిగింది. నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ధన్ పాల్ శ్రీనివాస్ ఎన్నికయ్యారు... మాణిక్ భవన్ పాఠశాల కమిటీ చైర్మన్ గా ఇంగు శివప్రసాద్ 501 ఓట్ల మెజార్టీతో, ఆర్య వైశ్య భవన్ కు ఇల్లెందుల సుధాకర్ 664 ఓట్లు, వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం కమిటీ చైర్మన్ గా పాల్తీ రవి 1365 ఓట్లతో ప్రత్యర్థిపై గెలుపొంది ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు నియామక పత్రాలను అందజేశారు.ఈ నేపథ్యంలో సంబరాలు నిర్వహించారు.
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >