Posted on 2025-07-09 15:55:22
హోటల్ మేనేజ్మెంట్ చేరిన వారు కెరీర్ పై దృష్టి పెట్టాలి..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం విష్ణుమ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ను ప్రముఖ ఫోక్ డాన్సర్ జాహ్నలిరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరాల రత్నాకర్ లు ఘనంగా ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కాలేజ్ విద్యార్థులతో ఆమె ఫోక్ డాన్స్ చేసి అందరిని అలరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరే విద్యార్థులు మంచి భవిష్యత్తుతో ఉన్నత శిఖరాలకు చేరుకొని తమ తల్లిదండ్రులకు, హోటల్ మేనేజ్మెంట్ పేరు నిలబెట్టాలని ఆమె ఆకాంక్షించారు. వివిధ విద్య చేరుతూ పై స్థాయికి వస్తున్నప్పటికీ కూడా హోటల్ మేనేజ్మెంట్ కోర్సును కూడా ఎంచుకొని విజయవంతంగా కోర్సును పూర్తి చేయాలని అలాగే విదేశాలలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు మంచి విద్యార్థులుగా పేరు తెచ్చుకోవాలని సూచించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరాల రత్నాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఇంటర్, డిగ్రీ ల తో పాటు హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ పిల్లలు చేరడానికి ఆసక్తి చూపడం కొత్త ఉరవడికి నాంది అని అన్నారు. ఈ హోటల్ మేనేజ్మెంట్ ఫౌండర్, చైర్మన్ ఈశ్వర్, ఇంచార్జ్ సిహెచ్ శ్రీకాంత్ లకు హోటల్ మేనేజ్మెంట్ అనుభవం ఉందని అన్నారు ఇందులో చదివిన వారికి నూటికి నూరు శాతం ఉద్యోగాలతో పాటు ప్లేస్మెంట్స్ ఇంటర్సిప్స్ వసతులు కల్పించడంతోపాటు, యూరప్, అబ్రాడ్, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తమకు చెప్పడం జరిగిందని ఆయన అన్నారు.
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >