| Daily భారత్
Logo




10000 PS హెడ్మాస్టర్ పోస్టులు మంజూరు చేయాలి : TPTF రాజన్న సిరిసిల్ల జిల్లా

News

Posted on 2025-07-08 18:38:15

Share: Share


10000 PS హెడ్మాస్టర్ పోస్టులు మంజూరు చేయాలి : TPTF రాజన్న సిరిసిల్ల జిల్లా

PSHM పోస్టుకు B,Ed,. D,.Ed,. సమాన అర్హతగా పరిగణించాలి

ప్రాథమిక పాఠశాలలో రేషనలైజేషన్ నిబంధనలు మార్చాలి

TPTF రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దుమాల రమానాధ్ రెడ్డి, విక్కుర్తి అంజయ్య డిమాండ్

ఈ రోజు TPTF రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ సమావేశం సిరిసిల్లలో నిర్వహించడం జరిగింది . ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు దుమాల రమానాధ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన 10 వేల PSHM పోస్టులు మంజూరు చేసి ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయ పోస్టు ఇవ్వాలని అన్నారు గత ప్రభుత్వం ప్రకటించిన పదివేల పోస్టులు ఇంతవరకు మంజూరు చేయలేదని వాటిని వెంటనే మంజూరు చేసి ప్రాథమిక పాఠశాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా పాఠశాలలను తీర్చిదిద్దాలని వారు డిమాండ్ చేశారు ప్రాథమిక పాఠశాలలో విద్య బాగుంటేనే విద్యా రంగం అభివృద్ధి చెందుతుందని ప్రాథమిక స్థాయిని నిర్లక్ష్యం చేయడం వల్లనే ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటుందని వారు అన్నారు..

అదేవిధంగా B,Ed అర్హత కలిగిన Sgt ఉపాధ్యాయులకు కూడా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయ పోస్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు , అంతే కాకుండా ప్రాథమిక పాఠశాల లో రేషనలైజేషన్ పేరుతో ప్రాథమిక పాఠశాలను మూసివేసే కుట్ర జరుగుతుందని 60 మంది విద్యార్థులకు కూడా ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించడం వల్ల విద్యార్థుల అభ్యసన తీవ్రంగా నష్టపోతుందని అందువల్ల ప్రభుత్వం 20 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించాలని 20 నుంచి 40 మంది విద్యార్థులు ఉంటే ముగ్గురు ఉపాధ్యాయులను 40 విద్యార్థుల పైన ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.. అదేవిధంగా ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండే విధంగా నిబంధనలను సవరించాలని వారు పేర్కొన్నారు..

ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి అంజయ్య, ఉపాధ్యక్షులు మందాడి శ్రీనివాస్ రెడ్డి, కెవి రజినీ రాణి, జిల్లా కార్యదర్శి మైలారం తిరుపతి, చకినాల రామచంద్రం, ఎడ్ల కృష్ణ చైతన్య రెడ్డి, జిల్లా అకాడమిక్ సెల్ కన్వీనర్ బుస రాజేందర్ లు పాల్గొన్నారు

Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >
Image 1

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

Posted On 2026-06-05 20:42:30

Readmore >
Image 1

కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

Posted On 2026-06-05 20:39:30

Readmore >
Image 1

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

Posted On 2026-06-05 20:23:17

Readmore >
Image 1

దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్

Posted On 2026-06-05 20:16:20

Readmore >
Image 1

ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్‌ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు

Posted On 2026-06-05 20:14:05

Readmore >