| Daily భారత్
Logo




జిలేటిన్ స్టిక్స్ అక్రమ నిలువ, వినియోగం కేసులో కాంగ్రెస్ నేత అరెస్ట్

News

Posted on 2025-07-06 14:30:12

Share: Share


జిలేటిన్ స్టిక్స్ అక్రమ నిలువ, వినియోగం కేసులో కాంగ్రెస్ నేత అరెస్ట్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల కామారెడ్డి లో దొరికిన నిషేధిత పేలుడు పదార్థాలు( జిలేటిన్ స్టిక్స్ అక్రమ వినియోగం, నిలువ కేసులో గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో ఇటీవల పీసీసీ కార్యవర్గంలో కామారెడ్డి జిల్లా నుంచి చోటు దక్కించుకున్న వారిలో ఇతను ఒక్కడు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సతీమణి గడ్డం ఇందుప్రియ తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్. కామారెడ్డి పట్టణంలోని కేపీఆర్ కాలనీలో ఇటీవల శ్రీధర్ అనే వ్యాపారి చేపట్టిన ఇంటి నిర్మాణంలో అడ్డుగా ఉన్న బండరాళ్ల ను తొలగించేందుకు జీలేటిన్ స్టిక్స్ వాడటంపై స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ కేసులు బొంత సత్యనారాయణ, బొంత సంపత్, బొంత రాజులు తోపాటు శ్రీధర్ ను పోలీసులు అరెస్టు చేశారు. సంబంధిత జిలిటిన్ స్టిక్కులను కామారెడ్డి పట్టణం లింగాపూర్ శివారులోని శ్రీవారి ఏకో వెంచర్ లో నిలువ ఉంచగా అందులో గడ్డం ద్రశేఖర్ రెడ్డి పాత్ర ఉందని పోలీసులు కేసు నిమోదు చేసి అరెస్ట్ చేసినట్టు తెలిసింది. చంద్రశేఖర్ రెడ్డి పాత్ర ఉందని పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. తాజాగా లైసెన్స్ లేకుండా నిషేధిత పేలుడు పదార్థాలు నిర్వహించారన్న కారణంతో ఆయనను అరెస్టు చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఈ విషయంపై గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సతీమణి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమైనట్టు తెలిసింది.

Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >
Image 1

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

Posted On 2026-06-05 20:42:30

Readmore >
Image 1

కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

Posted On 2026-06-05 20:39:30

Readmore >
Image 1

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

Posted On 2026-06-05 20:23:17

Readmore >
Image 1

దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్

Posted On 2026-06-05 20:16:20

Readmore >
Image 1

ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్‌ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు

Posted On 2026-06-05 20:14:05

Readmore >