Posted on 2025-06-27 08:26:47
డైలీ భారత్, బెంగళూరు: వంట నచ్చలేదని భార్యను భర్త నరికి చంపాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం రామనగర జిల్లా మాగడి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మత్తికెరెలో రంగయ్య(68), తిమ్మమ్మ(65) అనే దంపతులు నివసిస్తున్నారు. బుధవారం రాత్రి భార్య భర్తల మధ్య కూర బాగోలేదని గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో రంగయ్య కొబ్బరి తురిమే పీటతో భార్యను నరికేశాడు. గురువారం ఉదయం తిరుపతికి వెళ్లేందుకు బయలుదేరాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు భర్తను రామనగర ప్రాంతంలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
#banglore #karnataka #wife #crime #kill
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >