Posted on 2023-11-09 11:00:01
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల లో భాగంగా మరోసారి నరేంద్ర మోడీ హైదరాబాదుకు రానున్నారు. ఈనెల 11న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ వేదికగా "మాదిగ విశ్వరూప సభ" నిర్వహణకు బీజేపీ ఏర్పాట్లు చేసింది. సభకు ప్రధాని మోడీతోపాటు బీజేపీ అగ్ర నాయకులందరూ హాజరయ్యే అవకాశం ఉంది.
ఈ సభలోని ఎస్సీ వర్గీకరణ పై ప్రధాని కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నెల 11న సాయంత్రం 4:45 కు ప్రధాని మోడీ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకొనున్నారు. సాయంత్రం పెరేడ్ గ్రౌండ్లో జరిగే మాదిగ విశ్వరూప సభకు మోడీ హాజరవుతారు.
సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో సాయంత్రం 5 గంటల నుండి 5:45 వరకు మాదిగ విశ్వరూప సభ జరగనుంది. దాదాపు 45 నిమిషాల పాటు మోడీ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ఉండనున్నారు. సభ ముగిసిన అనంతరం 6 గంటలకు మోడీ తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.
అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకే వారంలో రెండుసార్లు ప్రధాని మోడీ హైదరాబాద్కి రావడం విశేషం.. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎస్సీ వర్గీకరణ పై ఈ సభలో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేస్తారని ఉహాగానాలు వినిపిస్తున్నాయి.
దీంతో పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ ఎప్పటినుండో ఆందోళన బాటపడుతున్న ఎస్సీలకు ఈ సభ ద్వారా తమ ఆకాంక్ష నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మోడీ టూర్ కు కొద్దిరోజుల ముందే బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఎస్సీ నాయకులు ముట్టడించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఎన్నికల్లో భాగంగా ఎస్సీ వర్గీకరణ పై ప్రకటన చేయాలని నేతలు పట్టుబడుతున్నారు.
దీంతో ఈ నెల 11న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే సభ లో ప్రధాని మోడీ ఎస్సీ వర్గీకరణ పై ఎలాంటి ప్రకటన చేస్తారో వేచి చూడాలి....
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >