Posted on 2023-11-08 12:34:11
TTU జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి
డైలీ భారత్, సిరిసిల్ల: నవంబర్ 30న తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల విధులు నిర్వహించుచున్న ఉద్యోగ,ఉపాధ్యాయులకు మరుసటి రోజు డిసెంబర్ 1వ తేదీన సెలవు ప్రకటించాలని తెలంగాణ టీచర్స్ యూనియన్(TTU) రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి ఒక ప్రకటనలో డిమాండ్ చేసారు. ఈ సందర్బంగా రవి మాట్లాడుతూ ఉద్యోగ,ఉపాధ్యాయులు నవంబర్ 29,30 తేదీల్లో ఎన్నికల విధులు నిర్వహించే నేపద్యంలో మానసిక, శారీరక అలసటకు గురి అవుతారని, ఎన్నికల విధులలో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు అందరికి డిసెంబర్ ఒకటవ తేదీన సెలవు ప్రకటించాల్సిన అవసరంవుందని అన్నారు. ఉద్యోగులు 30వ తేదీ న రాత్రి 1,2గంటలకు ఇంటికి చేరే పరిస్థితి దరిమిలా తెల్లారి డ్యూటీ చేయడం కష్టతరం అవుతుందని అన్నారు. ఎన్నికల విధులు ఎంతో బాధ్యత యుతంగా నిర్వహించాల్సి ఉంటుందని అన్ని రకాల మౌలిక సదుపాయలు కల్పించాలని, రెమ్యూనేషన్ సకాలంలో అందించాలని కోరారు..త్రాగు నీరు, భోజనాలు తదితర సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తడుకల సురేష్ లు పాల్గొన్నారు
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Posted On 2026-06-05 20:14:05
Readmore >