Posted on 2023-11-05 18:15:31
డైలీ భారత్ సిరిసిల్ల :రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన STU రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులుగా మొగలి లక్ష్మణ్
ప్రధాన కార్యదర్శి గా రేవోజు సదానందం
రాష్ట్ర కార్యదర్శిగా చాట్ల మల్లేశం
దీర్ఘకాలికంగా పెండింగ్ లోనున్న ఆర్థిక బకాయిలు తక్షణమే విడుదల చేయాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం పర్వత రెడ్డి డిమాండ్ చేశారు ఆదివారం సిరిసిల్ల సంఘ కార్యాలయంలో ఎస్టియు రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై ఎం పర్వత రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సకాలంలో వేతనాలు పెండింగ్ లోనున్న బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానం పునరుద్ధరణను ప్రముఖ రాజకీయ పార్టీ తమ ఎన్నికల ప్రణాళికలో చేర్చాలని కోరారు. అనంతరం నిలిచిపోయిన బదిలీలు పదోన్నతులు ఎన్నికల అనంతరం పూర్తిస్థాయిలో నిర్వహించాలని, అల్పాహార పథకంనకు సంబంధించి పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు విడుదల చేయాలన్నారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు మొగిలి లక్ష్మణ్ అధ్యక్షత వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శి రేవోజు సదానందం సంఘ కార్యకలాపములను నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు నరసింహారెడ్డి, శ్రీధర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుకూరి దయానంద్, ఎన్నికల అధికారి పట్నం భూపాల్, రాష్ట్ర కార్యదర్శి చాట్ల మల్లేశం, జిల్లా కార్యదర్శులు, అన్ని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. 2023 - 25 సంవత్సరానికి నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండవసారి ఎస్టియు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా మొగిలి లక్ష్మణ్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా రేవోజు సదానందం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి పట్నం భూపాల్ ఎన్నికల పరిశీలకులు శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు.
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >