Posted on 2023-11-02 15:52:55
డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల :రేపటి నుండి ప్రారంభమగు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ పక్రియ సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆనంద్ కుమార్,అదనపు ఎస్పీ చంద్రయ్య పోలీస్ అధికారులతో క్షేత్ర స్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ....
రేపటి నుండి ప్రారంభమగు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్స్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్,కేంద్ర బలగాలతో పటిష్ట భద్రత,సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.నామినేషన్ ల దాఖలుకు అభ్యర్థితో పాటు 5 గురికి ( 1 +4) కు మాత్రమే అనుమతి ఉంటుందని,ఐదుగురు కంటే ఎక్కువ మందికి లోపలికి పర్మిషన్ లేదు.నామినేషన్ కేంద్రం నుంచి 100 మీటర్ల దూరం వరకు బారికేడ్లు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరం నుండి కేవలం 3 వాహనాలనే అనుమతిస్తామని చెప్పారు. ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీల అభ్యర్థులు, ప్రతినిధులు సహకారం అందించాలన్నారు.
ఎస్పీ గారి సిరిసిల్ల డిఎస్పీ ఉదయ్ రెడ్డి, టౌన్ సి.ఐ ఉపేందర్, MRO షరీఫ్ మోహినుద్దీన్ ఉన్నారు.
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Posted On 2026-06-05 20:14:05
Readmore >